ఆర్టీసీ కండక్టర్ పెండెం వసంత్ కుమార్ కరోనతో మృతి
Published: Monday May 03, 2021
జగిత్యాల, మే 02 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లాకేంద్రం అంబెడ్కర్ నగర్ కాలాని (మోతె వాడ) వాసి ఆర్టీసీ కండక్టర్ (జగిత్యాల డిపో) పెండెం వసంత్ కుమార్ సుమారు వారంరోజులు కరోనతో పోరాడి శనివారం గాందీ హాస్పిటల్లో మరణించారు. కండక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నా క్రమంలో కరోన సోకినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. వసంత్ కుమార్ సామాజిక స్పృహ సంఘ సంస్కరణ అంబెడ్కర్ వాదిగా గిర్తింపు పొందిన వ్యక్తి, గతంలో ఎస్సి ఎస్టీ ఉద్యోగ సంఘాల నాయకులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
Share this on your social network: