అణగారిన వర్గాలకోసం పాటుపడ్డ దళిత ముద్దుబిడ్డ ముద్దం ప్రకాష్ కరోనతో మృతి
Published: Saturday May 29, 2021
ఘన నివాళ్ళుఅర్పించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
జగిత్యాల, మే 28 (ప్రజాపాలన ప్రతినిధి) : పంచాయతీ రాజ్ ఇంజనీర్ ముద్దం ప్రకాష్ కరోనాతో బాధపడుతూ గురువారం రాత్రి మరణించడంతో అత్యంత బాధాకరమని వ్యక్తిగతంగా తనకు దళిత జిల్లా వాసులకు తీరని లోటని స్థానిక ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం రోజున ముద్దం ప్రకాష్ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజనీర్ ఉద్యోగిగా ఆయన సేవలు మరువలేనివని నిత్యం అభివృద్ధికై పాటుపడే వ్యక్తి ముద్దం ప్రకాష్ అని అన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి స్నేహశీలి మృదుస్వభావి అని అన్నారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి ఎస్సీ ఎస్టీ సెల్ సభ్యుడిగా ఆయన ఎన్నో సేవలు చేశారని అణగారిన వర్గాల అభివృద్ధికై పాటుపడ్డ దళిత ముద్దుబిడ్డ ఆయన మరణం వ్యక్తి గతంగా జీర్ణించుకోలేక పోతున్నానాని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Share this on your social network: