దళిత బాంధవుడు శాసనసభ్యులుమల్లు భట్టి విక్రమార్క

Published: Saturday December 03, 2022
మధిర డిసెంబర్ 2 (ప్రజాపాలన ప్రతినిధి) దళిత బాంధవుడు మల్లు భట్టి విక్రమార్క అని అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని పేర్కొన్నారు. శుక్రవారం చింతకాని మండల కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు బందెల నాగార్జునకు సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో దళితబంధు పథకం కింద మల్లు భట్టివిక్రమార్క కృషితో మంజూరు అయిన కారును స్థానిక భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం వద్ద నాగార్జునకు అందించారు. ఈ సందర్భంగా మల్లు నందిని మాట్లాడుతూ రానున్న రోజులలో భట్టివిక్రమార్క  ఆధ్వర్యంలో ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు పథకం కింద యూనిట్లు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా వ్యాపారం చేసుకుని వారి కాళ్లపై వారే నిలబడి పదిమందికి ఆసరా కల్పించేలా తయారు కావాలని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు, దుంపా వెంకటేశ్వర రెడ్డి, ఆవుల కిరణ్, సంగయ్య యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అద్దంకి రవికుమార్ సర్పంచ్ పులిబండ్ల చిట్టిబాబు బీసీ సెల్ పట్టణ అధ్యక్షుడు బిట్రా ఉద్దండయ్య తదితరులు పాల్గొన్నారు