కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు

Published: Thursday April 15, 2021
మధిర, ఏప్రిల్ 14, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ డా//బాబా సాహెబ్ అంబెడ్కర్ 130 వ జయంతి కార్యక్రమాన్నిఘనంగానిర్వహించనైనది.ముందుగా మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ సెంటర్ నందుగల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ వారి రాజ్యాంగ స్పూర్తితో నే ఈ సమాజం అన్నివిధాలా అభివృద్ధి చెందినది అని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండారు నరసింహారావు, గ్రామ సర్పంచ్ మోగిలి అప్పారావు, ఎంపీటీసీ, ఇస్మాయిల్, కడియం శ్రీను, కంచర్ల వెంకటనర్సయ్య, ఉప సర్పంచ్ దేవరకొండ యేసు, దేవరకొండ శ్రీను, లింగాల నాగేశ్వరరావు, రాజీవ్ గాంధీ, అద్దంకి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.