కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు
Published: Thursday April 15, 2021
మధిర, ఏప్రిల్ 14, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్వర్గీయ డా//బాబా సాహెబ్ అంబెడ్కర్ 130 వ జయంతి కార్యక్రమాన్నిఘనంగానిర్వహించనైనది.ముందుగా మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ సెంటర్ నందుగల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం పలువురు మాట్లాడుతూ వారి రాజ్యాంగ స్పూర్తితో నే ఈ సమాజం అన్నివిధాలా అభివృద్ధి చెందినది అని వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, బండారు నరసింహారావు, గ్రామ సర్పంచ్ మోగిలి అప్పారావు, ఎంపీటీసీ, ఇస్మాయిల్, కడియం శ్రీను, కంచర్ల వెంకటనర్సయ్య, ఉప సర్పంచ్ దేవరకొండ యేసు, దేవరకొండ శ్రీను, లింగాల నాగేశ్వరరావు, రాజీవ్ గాంధీ, అద్దంకి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: