ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే

Published: Tuesday January 03, 2023
బెల్లంపల్లి జనవరి 2 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గం లోని వివిధ మండలాలకు చెందిన  లబ్ధిదారులకు ఐదు లక్షల 74 వేల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను, సోమవారం క్యాంపు కార్యాలయంలో  ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు,  ముఖ్యమంత్రి బలహీన వర్గాల వారు పడుతున్న బాధలను చూసి, వివిధ రూపాల్లో ఆర్థిక సహాయం అందజేస్తున్నారని, ప్రతి పైసను జాగ్రత్తగా వినియోగించుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత, వైస్ చైర్మన్ బి, సుదర్శన్ , కన్నెపల్లి జడ్పీటీసీ సత్యనారాయణ,  ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.