భద్రాచలం శ్రీ రాముడిని దర్శించుకున్న బీజాపూర్ శాసనసభ్యులు విక్రమ్ మండవి.

Published: Saturday October 15, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (ప్రజా పాలన.)
 బీజాపూర్ శాసనసభ్యులు విక్రమ్ మండవి జి మరియు జెడ్పీ చైర్మన్ శంకర్ కుడియా  బీజాపూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లాలు లాటూర్ జడ్పీ వైస్ చైర్మన్ మరి కొంత మంది కౌన్సిల్ సభ్యులు కాంగ్రెస్ నాయకులు తో కలిసి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారినీ  దర్శించుకున్నారు. ఈ కార్యక్రమానికి  అశ్వాపురం మండలం కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి సాదరంగా ఆహ్వానం పలికి దర్శనం చేపించి శాలువాలతో సత్కరించి తేనేటి విందు ఇచ్చి పంపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదే కేశవరెడ్డి ,నియోజకవర్గ యువజన నాయకులు బట్ట విజయ గాంధీ ,సొసైటీ వైస్ చైర్మన్  గాదె వెంకటరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఓరుగంటి బిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు