*మద్దెల నాయకత్వంలో మధిరలో వైఎస్సార్ టిపి బలోపేతంమధిర నాయకులను అభినందించిన రాష్ట్ర పరిశీలక

Published: Friday December 16, 2022

మధిర రూరల్ డిసెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధిమధిర నియోజకవర్గంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతం కోసం మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షులు రిటైర్డు సిఐ డాక్టర్ మద్దెల ప్రసాదరావు నాయకత్వంలో మండల కమిటీల పనితీరు బాగుందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఖమ్మం జిల్లా పరిశీలకులు పిట్టా రామిరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం పట్టణంలో ఈనెల 16వ తేదీన జరగబోయే షర్మిల సభ విజయవంతం కోసం గురువారం ఖమ్మంలో మధిర నియోజకవర్గం ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిట్టా రాంరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన ఖమ్మంలో జరిగే షర్మిల సభకు మధిర నియోజకవర్గ నుండి భారీ స్థాయిలో కార్యకర్తలను తరలించాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అక్రమ అరెస్టుపై పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు మధిర నియోజకవర్గంలో కోఆర్డినేటర్ మద్దెల ప్రసాదరావు నాయకత్వంలో మండల కమిటీలు వెంటనే స్పందించి పార్టీ విధానాలను ప్రజలకు వివరించడంలో ఎంతో ముందున్నారని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బూత్ కమిటీలు ఏర్పాటు ఇంటింటికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. మధిర నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న నియోజకవర్గ కోఆర్డినేటర్ మద్దెల ప్రసాదరావుతో పాటు మండల అధ్యక్షులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి, సామినేని రవి, ఐలూరు ఉమామహేశ్వర రెడ్డి, షేక్ మౌలానా, వేమిరెడ్డి మల్లారెడ్డి పాల్గొన్నారు.