అనారోగ్య కుటుంబానికి 2 లక్షల 50 వేల ఎల్.ఓ.సి : సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.

Published: Friday December 17, 2021

వెల్గటూర్, డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం రాజారాంపల్లె గ్రామానికి చెందిన యు.గంగయ్య  అనారోగ్యంతో బాధపడుతు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కలవగా తక్షణమే స్పందించిన మంత్రి గంగయ్య కుటుంబ ఆర్ధిక పరిస్థితిని తెలుసుకొని ముందస్తు వైద్యం కోసం వారికి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం 2.50 లక్షల రూపాయల ఎల్.వో సి.ని గురువారం హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులని కుటుంబ సభ్యులకు మంత్రి కొప్పుల అందించారు. ఈ సందర్భంగా గంగయ్య కుటుంబ సభ్యులు మరియు రాజారామ్ పల్లి గ్రామ సర్పంచ్ గెల్లు శేఖర్, వెల్గటూర్ మండల తెరాస మండల శాఖ అధ్యక్షులు సింహాచలం జగన్ మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.