గ్రామ ఉప సర్పంచ్ ఎంపీటీసీ గ్రామ సెక్రటరీ కి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు

Published: Thursday February 03, 2022
ఇబ్రహీంపట్నం పిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం పరిధిలో కొత్తపల్లి గ్రామంలో గ్రామ ప్రజలు ఉప సర్పంచ్ జగన్ ఎంపీటీసీ సుమ తమ్మా లోహిత్ రెడ్డి సెక్రెటరీ వేణు గారిని కలిసి వినతిపత్రం అందజేశారు కొత్త  పల్లి గ్రామంలో గ్రామ సమీపంలో ఉన్న కంపెనీ దుర్వాసన రావడం తోటి ప్రజలకు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదు చేయగా గ్రామంలో కంపెనీ దుర్వాసన రావడంతో పిల్లలు అనారోగ్యానికి గురయ్యారు ఒక్క రోగాల బారిన గ్రామ ప్రజలు పడుతున్న వ్యవసాయ రైతులు పొలానికి పోకుండా దుర్వాసనతో ఇబ్బంది పడుతుంనారు అట్టి కంపెనీని రాత్రి పూట దుర్వాసన రావడంతోగ్రామ ప్రజలు కంపెనీని మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పి నరసింహ, వార్డు మెంబర్ శ్రీనివాస్ గౌడ్,  అండ్డేకార్ పరమేష్, మాధవ రెడ్డి, కాశ కృష్ణయ్య, వెంకటాచారి,  రవీంద్ర, యాదగిరి, వెంకటేష్, గణేష్, తదితరులు పాల్గొన్నారు.