బియ్యపు గింజపై ఎమ్మెల్సీ రమణ చిత్రపటం

Published: Thursday October 06, 2022

జగిత్యాల, అక్టోబర్ 04 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ యొక్క చిత్రపటాన్ని బియ్యం గింజ పై చెక్కి ఎమ్మెల్సీ నివాసంలో  బహూకరణగా అందజేశారు. తన కళానైపుణ్యాని మెచ్చుకున్న ఎమ్మెల్సీ అతనికి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు.