బసవతారక నగర్ వాసులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి, దుబ్బాక శాసన సభ్యులు మ

Published: Saturday December 11, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లోని బసవతారక నగరవాసులను శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి పరామర్శించడం జరిగింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యదర్శి దుబ్బాక శాసన సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ కొన్ని వందల కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని కే.టీ.ఆర్ అండ్ కో కంపెనీ ఎవరికీ కట్టబెట్టాలని ఈ నిరుపేదలను రోడ్డు కు లాగింది అన్ని అన్నారు. అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నివాసముంటు కరెంటు బిల్లు, నల్లాబిల్లు, ఇంటి నెంబరు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటు హక్కును ఇదే అడ్రస్ మీద కలిగి ఉన్న స్థానికుల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ధ్వంసం చేయటం అమానుషమైన చర్య, వీళ్లకు ఉండటానికి కూడు, గూడు, గుడ్డ లాంటి మౌలిక వసతులు కల్పించకుండా నడిరోడ్డుపాలు చేయటం ఎంత వరకు సమంజసం. కనీసం పసి పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు ఉన్నారని కనీస ఇంగితజ్ఞానాన్ని మరచిన ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ వీళ్లకు తక్షణమే ఈ కూల్చిన ఇళ్లకు నష్టపరిహారం కల్పిస్తూ వీరికి ఉన్నచోటనే ఇళ్ల పట్టాలను కేటాయించాలి లేదా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసే వరకూ భారతీయ జనతా పార్టీ ఈ నిరుపేదలకు అండగా ఉంటూ న్యాయపోరాటం చేస్తుందని అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.