సీఎల్పీ నేత భట్టి పాదయాత్రచిలుకూరు గ్రామ ప్రజలు బ్రహ్మరథం

Published: Friday April 22, 2022
మధిర ఏప్రిల్ 21 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో చిలుకూరు గ్రామంలో సీఎల్పీ బట్టి పాదయాత్రకు గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు అదేవిధంగా స్వాగతం పలుకుతూ మేళతాళాలతో ప్రజల నుండి ఇ విశేష స్పందన వచ్చిందని కాంగ్రెస్ కార్యకర్తలు జై జైలు బట్టి అంటూ ప్రజా సమస్యలపై పాదయాత్ర తో ముందుకు వెళ్లారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రశ్నిస్తే పీడి  కేసులు నిలదీస్తే ఐటీ, ఈడీ దాడులు ప్రతిపక్షాలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్న రాజ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ప్రజా సంక్షేమం కోసం పని చేయాల్సిన రాజ్యం ప్రశ్నించే వారిని నిర్బంధించే కార్యక్రమం చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఐటీ, ఈడీ దాడులు చేసి భయపెట్టిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా పీడీ యాక్ట్ కేసులు పెట్టించి వేధింపులకు పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ప్రజాసమస్యల పరిష్కారం కొరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర 28వ రోజు గురువారం మధిర మండలం చిలుకూరు గ్రామంలో మొదలైంది. గ్రామ సర్పంచ్ సంధ్య వంశీ లు భారీ గజమాలతో సీఎల్పీ నేతను సత్కరించారు. మహిళలు మంగళ హారతులు పట్టి వీర తిలకం దిద్దారు.  ఈ సందర్భంగా మహనీయుల విగ్రహాలను పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం గ్రామంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలోని రచ్చబండ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రశ్నించే వారిని ప్రభుత్వం పోలీసులతో వేధింపులకు గురి చేయడం వల్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం నేరమ్మన్నట్టుగా పాలక పక్షాలు వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను చూసి చలించి బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించడానికి నడుం బిగించానని తెలిపారు. ప్రభుత్వం ప్రయోగిస్తున్న నిర్బంధాలను ఎదురొడ్డి ప్రజాసమస్యల పరిష్కారం కొరకు పాదయాత్ర చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నిడమానూరుసంధ్య మల్లు నందిని కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు మండల కాంగ్రెస్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కిషోర్ రమణ గుప్తా శ్రీనివాసరెడ్డి వంశీ వేణు బాలరాజు రవి వెంకటేష్ రెడ్డి రామారావు మాాజీ మార్కెట్ యాడ్ చైర్మన్ హనుమంతరావు బుచ్చి రావు అనుబంధ సంఘాలు కిసాన్ సెల్ నాయకులు పాల్గొన్నారు