వానరంను వేటాడి వెంటాడి చంపిన శునకాలు శంకరపట్నం మార్చి01 ప్రజాపాలన రిపోర్టర్:

Published: Thursday March 02, 2023

శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఇస్లాంపుర కాలనీ వద్ద గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వానరాన్ని వెంటాడి విచక్షణారహితంగా వేటాడి చంపాయి. ఇది చూసిన కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ గుంపులు గుంపులుగా తిరుగుతున్న ఈ శనకాలు ఆ దారిలో వెళ్లే కాలనీవాసుల వెంటపడి కరిచే ప్రయత్నాలు  చేస్తున్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాలనీలోని చిన్నపిల్లలు ఒంటరిగా బయటికి వస్తే ఆ శునకాలతో ప్రమాదం ఉన్నట్లు పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేక ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను వారు గుర్తు చేసుకుంటూ  భయపడుతున్నారు. అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.