వానరంను వేటాడి వెంటాడి చంపిన శునకాలు శంకరపట్నం మార్చి01 ప్రజాపాలన రిపోర్టర్:
Published: Thursday March 02, 2023
శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో ఇస్లాంపుర కాలనీ వద్ద గుంపులుగా తిరుగుతున్న కుక్కలు వానరాన్ని వెంటాడి విచక్షణారహితంగా వేటాడి చంపాయి. ఇది చూసిన కాలనీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ గుంపులు గుంపులుగా తిరుగుతున్న ఈ శనకాలు ఆ దారిలో వెళ్లే కాలనీవాసుల వెంటపడి కరిచే ప్రయత్నాలు చేస్తున్నాయని, ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాలనీలోని చిన్నపిల్లలు ఒంటరిగా బయటికి వస్తే ఆ శునకాలతో ప్రమాదం ఉన్నట్లు పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేక ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను వారు గుర్తు చేసుకుంటూ భయపడుతున్నారు. అధికారులు, గ్రామపంచాయతీ పాలకవర్గం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Share this on your social network: