అభివృద్ధికి నోచుకోని మున్సిపాలిటీ

Published: Tuesday May 31, 2022
 బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ 
 
మంచిర్యాల టౌన్, మే 30, ప్రజాపాలన : అభివృద్ధికి నోచుకోని మంచిర్యాల మున్సిపాలిటీ,పూర్తిగా కుంటుపడింది అని అన్నారు. మంచిర్యాల మున్సిపాలిటీకి ఒక్క శాశ్వత డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలు నిర్మించడం లో మన ఎమ్మెల్యే పూర్తిగా విఫలం చెందారని. సోమవారం రోజున మంచిర్యాల పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో బిజెపి మంచిర్యాల పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు  అధ్యక్షతన నిర్వహించిన మంచిర్యాల పట్టణ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్  పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంచిర్యాల మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యల పై పోరాటం, గత ఎన్నికల సమయంలో  ప్రభుత్వం ఇచ్చిన హామీన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.   కేంద్రంలో నరేంద్ర మోదీ  8 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాల పై చర్చించారు.ఈ కార్యక్రమంలో  పెద్దపెల్లి పురుషోత్తం , రజినిష్ జైన్, రెకందర్ వాణి, మాసు రజిని, బియ్యాల సతీష్ రావు, జోగుల శ్రీదేవి, బొద్దున మల్లేష్, బొడకుంట ప్రభ, గాజుల ప్రభాకర్, బుద్దరపు రాజమౌలి, ముదాం మల్లేష్, నాగుల రాజన్న, పూదరి రమేష్, చిప్పరి రాజా మల్లయ్య, కుదురుపాక గంగన్న, పచ్చ వెంకటేశ్వర్లు, మెరెడికొండ శ్రీనివాస్, గుర్రాల లావణ్య, పచ్చ స్వప్న రాణి, పిరిసింగుల వాణి శ్రీ, ముడారి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.