మహా మండలి పడి పూజా మహోత్సవం పోస్టర్ ఆవిష్కరణ*

Published: Wednesday November 16, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 15, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా  రామకృష్ణాపూర్ లోని శ్రీ విజయ గణపతి దేవాలయం ఈ నెల 27  న ఠాగూర్ స్టేడియంలో జరిగబోయేనటువంటి  అయ్యప్ప స్వామి మహా మండలి పడి పూజా మహోత్సవ కరపత్రాన్ని, పోస్టర్ ను జిఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ రాజ రమేష్ బాబు, అయ్యప్ప స్వామి బృందం సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజ రమేష్ , అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ  అయ్యప్ప స్వామి మహా మండలి పూజ కార్యక్రమాన్ని  జిఎస్ఆర్ ఫౌండేషన్  ఆధ్వర్యంలో జరగబోతుందని రామకృష్ణాపూర్  పట్టణ పరిసరాల ప్రాంతం లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అయ్యప్ప స్వామి కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ మహా పడిపూజని విజయవంతం చేయాలని పట్టణంలోని వివిధ ఆలయాల కమిటీలకు, భక్తులకు, పట్టణవాసులకు పిలుపునిచ్చారు.  అయ్యప్ప స్వాములు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మహా పడిపూజ మహోత్సవం  విజయం వంతం చేయాలని కోరారు.