మహనీయుల అడుగుజాడలో అందరం కలిసి ప్రయాణం చేద్దాం

Published: Wednesday April 07, 2021
బాలాపూర్, ఏప్రిల్ 06, ప్రజాపాలన ప్రతినిధి : సమాజంలో సమానత్వంతో ఎల్లవేళల కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రావు నీ మీర్ పేట్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడ లో కార్పొరేషన్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ 43వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల రామ్ చందర్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 113 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి, టిఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షురాలు సిద్దాల లావణ్య బీరప్ప కార్పొరేషన్ కార్పొరేటర్లు కలిసి డాక్టర్ బాబు జగ్జీవన్ రావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ లు  మాట్లాడుతూ.... మాజీ ఉప ప్రధానమంత్రి గా రైల్వే మంత్రిగా వ్యవసాయ మంత్రిగా పనిచేసిన మహోన్నత వ్యక్తి సమాజంలో పేద నిరుపేద సంక్షేమం గురించి ఎల్ల వేళ తపన పడుతున్న మహనీయులని వారి త్యాగాలు దేశానికి భావితరాలకు గుర్తున్నట్లు చేస్తున్న వేడుకలు ఆయన సూక్తులతో ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఆమె మహనీయుల అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలందరి కోసం సమానత్వంతో కలిగి ఎల్లవేళల అమ్మ అంటే పలికే సబితమ్మ ప్రజల హృదయాలలో ఉన్నారని సభాముఖంగా కొనియాడారు. స్థానిక కార్పొరేటర్ గజ్జల రామచందర్ మాట్లాడుతూ.... రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మీర్ పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, బహుజన నాయకులు బైగాళ్ళ  బాలమణి, దాసరి కిరణ్, మాధురి శ్రీనివాస్, ఓం ప్రకాష్, లప్ప లక్ష్మణ్, పవన్ కుమార్, దర్శన్ కాలనీవాసులు అభిమానులు యువకులు తదితరులు పాల్గొన్నారు.