ప్రదీప్ కు నివాళులర్పించిన ఎమ్మెల్యే సండ్ర..

Published: Monday September 19, 2022
తల్లాడ, సెప్టెంబర్ 18 (ప్రజా పాలన న్యూస్):
వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ అల్లుడు జూపల్లి ప్రదీప్ కుమార్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న  సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆదివారం ఖమ్మం రూరల్ మండలం కరుణగిరిలోని జూపల్లి ప్రదీప్ కుమార్  నివాసంకు వెళ్లి  ప్రదీప్ చిత్రపటానికి  పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. 
అనంతరం కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి తమ ప్రగాఢ సానభూతిని తెలిపారు.