ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి తేదీ 22ప్రజాపాలన ప్రతినిధి ***ఆరుట్ల గ్రామానికి చెందిన ఎంబిబిఎస్ పట్ట

Published: Thursday February 23, 2023

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టిన వారిని సన్మానించి ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొంగర విష్ణు వర్ధన్ రెడ్డి  మాట్లాడుతూ....
మన గ్రామం నుండి  ఎంబిబిఎస్ పట్టా పొంది డాక్టర్స్ కావడం ఎంతో అభినందనీయం అన్నారు.వారి కుటుంబాలు కూడ ఉపాధ్యాయ, డాక్టర్స్ వృత్తిలో అనాదిగా గ్రామానికి, సమాజానికి సేవలు  అందించారు. అనీ ఆయన కొనియాడారు.. వారి వారసులు ఆస్తులకే కాకుండా వారి ఆశయాలకు కూడ వారసులుగా నిలిచి సాధించడం గ్రామంలోని యువతకు ఆదర్శం  అనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్.  ఎంపీటీసీ చీరాల రమేష్.  పిఎసిఎస్. డైరెక్టర్ కొంగర జనార్దన్ రెడ్డి. పంచాయితీ కార్యదర్శి వెంకటేష్.  వార్డు మెంబర్స్ మోహన్ రెడ్డి , శివ కుమార్ , వెంకటేష్ , సద్దాం, మాజీ సర్పంచ్ యాదయ్య , హై స్కూల్  ఎస్ ఎం సీ చైర్మన్ నూకం రాజు , గ్రామస్టులు గుడ్డి మళ్ళీ చంద్రయ్య ,అనిల్ రాజు,సుంకరి. ప్రవీణ్,. సురేష్, నూకం. మల్లేష్,పున్నం. రాము, వారి కుటుంబ సభ్యులు  డాక్టర్ సలీమ్ ఖాన్  డాక్టర్.దశరథ  గ్రామస్తులు పాల్గొన్నారు.