రోటరీ క్లబ్ చిట్యాల నూతన కార్యవర్గం ఎన్నిక.
Published: Tuesday October 19, 2021
యాదాద్రి జిల్లా అక్టోబర్ 17 ప్రజాపాలన ప్రతినిధి : అధ్యక్షుడిగా మందడి జనార్ధన్ రెడ్డి, కార్యదర్శిగా తీగల కృష్ణ కుమార్, ఉపాధ్యక్షుడుగా మల్లేశం మరియు కోశాధికారిగా దేవరపల్లి బలవంతరెడ్డి ఎన్నిక అయినట్లు డాక్టర్ ఎంపల్ల బుచ్చిరెడ్డి చైర్మన్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. నార్కెట్ పల్లి న్యూ వివేరా హోటల్ లో రోటరీ క్లబ్ సమావేశం చైర్మన్ ఆద్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిలుగా రోటరీ క్లబ్ మాజీ గవర్నర్ ఎన్వీ హనుమంతరెడ్డి, న్యూ క్లబ్ తెలంగాణ రీజియన్ అసిస్టెంట్ గవర్నర్ దిడ్డి బాలాజీ, భువనగిరి క్లబ్ మాజీ గవర్నర్ గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి తదితరులు హాజరైనారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన పలు సేవా కార్యక్రమాలను వక్తలు కొనియాడారు. చిట్యాల రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం సభ్యులతో చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులకు నియామకం పత్రాలను అందజేశారు. భువనగిరి పోర్ట్ రోటరీ క్లబ్ కార్యదర్శి జిట్టా భాస్కర్ రెడ్డి చిట్యాల ప్రముఖులు ప్రాథమిక సభ్యులు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన సభ్యులు తదితరులు హాజరయ్యారు.
Share this on your social network: