కనకపుడి చిన్న సుబ్బారావు మృతదేహనికి నివాళులు అర్పించిన సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవి

Published: Monday March 29, 2021
మధిర మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి : మడుపల్లి గ్రామంలో ఈరోజు తెల్లవారు  ఝామున గుండెపోటుతో సిపిఐ సీనియర్ నాయకులు కనకపూడి చిన్న సుబ్బారావు గారు మరణించినారు. ఈ సందర్బంగా బెజవాడ రవి మాట్లాడుతూ కామ్రేడ్ చిన్న సుబ్బారావు గారు లేని లోటు సిపిఐ పార్టీకి ముఖ్యంగా మాడుపల్లి గ్రామ శాఖ కు తీరని లోటు అని తుదిశ్వాస వరకు ఎర్ర జండా ను వదలకుండా పేదల పక్షాన సమస్యలు పరిష్కారం కొరకు నిరంతరం పాటుపడేవాడని అటువంటి వ్యక్తి భౌతికంగా దూరం అవడం చాలా బాధాకరమని అన్నారు. వారి కి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి ఎల్లవేళలా సిపిఐ అండగావుంటుందని తెలియజేసారు. ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మందడపు నాగేశ్వరరావు, మండల కార్యదర్శి ఊట్ల కొండ, జిల్లా సమితి సభ్యులు ప్రకాశరావు, ఏఐటీయూసీ నాయకులు చెరుకూరి వెంకటేశ్వరరావు, మడుపల్లి సిపిఐ కార్యదర్శి నాగకృష్ణ, సీనియర్ నాయకులు పంగా శేషగిరి, సత్యనారాయణ, శ్రీను, నివాళులు అర్పించారు.