మొక్కలు నాటి మంచినీటి ట్యాంకులను శుభ్రం చేసిన కౌన్సిలర్

Published: Monday July 05, 2021

బెల్లంపల్లి జూలై 4 ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చేపట్టిన మూడో విడత కార్యక్రమంలో  భాగంగా ఆదివారం నాడు ఒకటో వార్డు లో చెట్లు నాటి మంచినీటి సరఫరా చేసి ఓవర్ హెడ్ ట్యాంకులను బ్లీచింగ్ పౌడర్ తో క్లీన్ చేయించినట్లు కౌన్సిలర్ సూరం సంగీత బానేష్ తెలిపారు. కార్యక్రమాల అనంతరం ఆమె మాట్లాడుతూ పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో జరుగు తున్నట్లు ఒకటో వార్డులో కూడా దుర్గం చిన్నయ్య ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ జక్కులశ్వేత శ్రీధర్ ఆధ్వర్యంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అందులో భాగంగానే మూడవ రోజు కార్యక్రమంలో మొక్కలు నాటి ప్రజలు ఆరోగ్యంగా ఉండడానికి మంచినీటి సరఫరా వాటర్ బ్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ తో పరిశుభ్రత చేయించామని తెలిపారు, ఈ కార్యక్రమంలో వార్డు ప్రత్యేక అధికారులు స్వామి, రాజేశ్వరి వార్డు జేఏసీ కమిటీ సభ్యులు మున్సిపల్ సిబ్బంది బస్తీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో మూడవ విడత హరితహారం
బెల్లంపల్లి పట్టణంలో చేపట్టిన మూడవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఒకటో వార్డు కౌన్సిల్ సభ్యులు సూరంసంగీత బానేష్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి మున్సిపల్ సిబ్బంది చే మంచి నీటి ఓవర్ హెడ్ ట్యాంకులు శుభ్రం చేసినారు, పట్టణంలోని అన్ని వార్డులలో గల మంచినీటి ట్యాంకులను కూడా మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ అధికారులకు కౌన్సిల్ సభ్యులకు ఆదేశాలు జారీ చేసిన గౌరవ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీధర్ గారు ఈ కార్యక్రమంలో అధికారులు స్వామి ప్రత్యేక అధికారి రాజేశ్వరీ, వార్డు సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.