పోచమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి : రజితపరమేశ్వర్ రెడ్డి

Published: Friday July 02, 2021
మేడిపల్లి, జూలై 01 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ నల్లచెరువు సమీపంలో నెలకొన్న పోచమ్మ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తానని స్థానిక కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేవాలయ ప్రాంగణంలో గురువారం కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి బోరు పనులను ప్రారంభించారు. దశల వారీగా దేవాలయ అభివృద్ధి పనులను చేపట్టనున్నట్టుగా కార్పొరేటర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, ఏ ఈ వసంత, స్థానిక పెద్దలు దుబ్బ నర్సింహ్మరెడ్డిి, సల్ల రాజిరెడ్డి, పోగుల దయాకర్ రెడ్డి, బోరంపేట కృష్ణ, బిక్కుమళ్ల అంజయ్య, సల్ల వీర రెడ్డి, బాకారం లక్ష్మణ్, ఈగ ఆంజనేయులు, గుద భాస్కర్, సోమ్ జంగయ్య, సల్ల ప్రభాకర్ రెడ్డి, బోరంపేట్ జైకృష్ణ, లింగంపల్లి రామకృష్ణ, ప్రశాంత్ రెడ్డి, పాలడుగు లక్ష్మణ్, తోకట రాజు, అలుగుల అనీల్ కుమార్, అల్వాల భాస్కర్, ఢిల్లీ చంద్ర శేఖర్ రెడ్డి, కోమటిరెడ్డి కృష్ణ రెడ్డి, రాఘవేందర్, హనుమంత్, ప్రేమ్, రాజిరెడ్డి, జిత్తు రెడ్డి, కన్నమైన నరేష్ తదితరులు పాల్గొన్నారు.