సీపీఐ కార్యకర్త కృష్ణకు ఘన నివాళి

Published: Tuesday October 25, 2022

బోనకల్, అక్టోబర్ 23 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధి లోని రాయనపేట గ్రామానికి చెందిన సిపిఐ కార్యకర్త పరసగాని కృష్ణ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం ఆయన సంస్మరణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాసరావు, బొమ్మినేని కొండలరావులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిపిఐ పార్టీలో నిబద్ధతతో పనిచేసి ఇద్దరు కుమారులను గ్రామీణ వైద్యులగా తీర్చిదిద్దారన్నారు.నివాళులర్పించిన వారిలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్, ఏలూరు పూర్ణచందు, ఆర్ఎంపీడబ్ల్యూఏటిఎస్ నాయకులు ఎస్.వి.రామారావు, కొంగర గోపి, షేక్ ముసి, మరిదు కిషోర్, సిలివేరి కిషోర్, మరీదు రవి, కృష్ణ కుమారులు ,గ్రామీణ వైద్యులు పరసగాని నాగేశ్వరరావు, పరసగాని పుల్లారావులు తదితరులు ఉన్నారు