పలు కుటుంబాలను పరామర్శించిన గ్రామ సర్పంచ్ కొమినేని ఉపేందర్

Published: Monday July 11, 2022

బోనకల్, జూలై 11 ప్రజా పాలన ప్రతినిధి: జిల్లా మత్స్య శాఖ అధ్యక్షులు,రావినూతల గ్రామ ముత్యశాఖ సొసైటీ అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మకంటి సైదులుకు ఇటీవల రోడ్డు ప్రమాదంలో కాలికి గాయమైనదని తెలుసుకొని గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ రావినూతల గ్రామంలో వారి స్వగృహం నందు వెళ్లి పరామర్శించడం జరిగింది. అదేవిధంగా రావి నూతల గ్రామ బీసీ కాలనీకి చెందిన పెద్దలు శివమ్మ ఇటీవల కంటి ఆపరేషన్ చేయించుకున్నారని తెలిసి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోయినపల్లి కొండలు , జెడి మూర్తి, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు ముడావత్ సైదా, తుడుం మంగయ్య, షేక్ కరీం, నాగరాజు, షేక్ అల్లా బాబు, షేక్ కన్నె సాహెబ్, అజ్మీర తులస, ఇండ్ల ఆదాం తదితరులు పాల్గొన్నారు.