మౌఖిక సమస్యలు త్వరితగతిన పూర్తి చేయాలని బూర్గంపాడు జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలతకు వినతి పత

Published: Saturday November 05, 2022
బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత  సారపాక ప్రాంతంలో వీధి వీధి తిరుగుతూ ప్రజా సమస్యల్ని తెలుసుకుంటున్న జెడ్పిటిసి  ఈరోజు మే డే కాలనీలో రోడ్లు డ్రైనేజీలు, మంచినీళ్లు సమస్యల్ని గుర్తిస్తూ పర్యటన చేస్తున్న శ్రీలత కి సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మేడే కాలనీ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్తూ ప్రాంతంలో సిసి రోడ్లు, పక్క డ్రైనేజీలు, మంచినీళ్లు సమస్య పైన వినతి పత్రం జడ్పిటిసి కి అందించడం జరిగింది వారు వెంటనే ఈ ప్రాంతంలో మేము సమస్యల్ని గుర్తించటానికి తెలుసుకోవటానికి ఈ పర్యటన చేస్తున్నామని ,వెంటనే మీ సమస్యల్ని పరిష్కరిస్తామని సీసీ రోడ్డు కూడా ఏపిస్తామని వారు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకట్ రెడ్డి ,రాయి కృష్ణ,  శేషావతారం ,రమణయ్య సిహెచ్ పార్వతి బత్తుల ద్రౌపతి, దుర్గ సత్య దేవేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.