ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 3 ప్రజాపాలన ప్రతినిధి ***గ్యాస్ గుదిబండ ప్రజలపై పెనుబారం మోపుతుందని

Published: Saturday March 04, 2023
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతున్న వంటగ్యాస్ సిలిండర్ ధరల పెరుగుదలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉదయం 10.45 గంటలకు ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో జిల్లా  బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు , మన ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  పాల్గొనెదరు. సత్తు వెంకటరమణారెడ్డి , జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ , రంగారెడ్డి జిల్లా.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డగోలుగా పెంచిన వంటగ్యాస్ ధరలకు నిరసనగా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ చౌరస్తాలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన  ధర్నాలో పాల్గొన్న జిల్లా బి ఆర్ ఎస్  అధ్యక్షుడు , ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి. అనంతరం  సాగర్ రహదారిపై నరేంద్రమోడీ దిష్టిబొమ్మను మహిళలు ,  బీ ఆర్ ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,   మండల అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపల్ అధ్యక్ష కార్యదర్శులు, కౌన్సిలర్లు, గ్రామల అధ్యక్ష కార్యదర్శులు, యువజన విభాగ నాయకులు, బిఆర్ఎస్వి నాయకులు, మహిళా నాయకులు. పెద్ద ఎత్తున పాల్గొని దిష్టిబొమ్మ దహనం చేశారు.