ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

Published: Friday May 21, 2021

పరిగి, 20 మే, ప్రజా పాలన ప్రతినిధి : దొంగతనం జరిగిన సంఘటన దోమ మండల పరిధిలోని బస్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై దేవo బోట్ల రాజు తెలిపిన వివరాల ప్రకారం శంకరమ్మ భర్త అనంతయ్య గత మూడు రోజుల క్రితం  సందమ ఇంట్లో సన్న గుండ్ల తాడును దొంగిలించినారు. శంకరమ్మ వెంబడి సందమ్మ గమనించి వెoబడి  వెళ్లగా విషయం గమనించి పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించారు. ఈ పంచాయితీలో గ్రామా పెద్దలను 15 రోజులు సమయం కావాలని అడగగా సందమ్మ కొడుకు శ్రీనివాస్ ఇవ్వని చెప్పాడు. అనంతరం మనస్తాపంతో  అనంతయ్య ఇంటి దగ్గర ప్లాస్టిక్ తాడుతో ఊరి వేసుకొని ఆత్మ హత్య చేసుకున్నాడు. దీనితో భార్య  శంకరమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవం బోట్ల రాజు తెలిపారు.