ప్రతి ఒక్కరూ శరీర దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Published: Tuesday July 13, 2021
రాయదుర్గంలో భారతీయ నవయుగ సంఘం వ్యాయామశాల 
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని రాయదుర్గంలో భారతీయ నవయుగ సంఘం వ్యాయామశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర బిజెపి నాయకులు యం.రవి కుమార్ యాదవ్ గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. అలాగే వ్యాయామ సామాగ్రిని రాష్ట్ర బిజెపి నాయకులు యం.రవి కుమార్ యాదవ్ గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి స్వయంగా భారతీయ నవయుగ సంఘం వ్యాయామశాల ప్రతినిధులకు అందించటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజల సౌకర్యార్థం మానవ శరీరానికి అవసరమయ్యే కనీస వ్యాయామ ప్రక్రియను అందించే వ్యాయామశాల అయినటువంటి జిమ్ సెంటర్ ద్వారా మెరుగైన సేవలను పొంది తమ విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని ఆయన అన్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శరీర దారుఢ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారన్నారు. ఆరోగ్య సమస్యలు దరి చేరకుండా ఉండేందుకు వ్యాయామం ముఖ్యమని, ఇలాంటి వ్యాయామశాలలు మరిన్ని ఏర్పాటు చేసి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు నరేందర్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, డివిజన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చారి, చెట్టి మహేందర్ గౌడ్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ దయాకర్, సీనియర్ నాయకులు కృష్ణ యాదవ్, నరేందర్ యాదవ్, శంలేట్ రాజు, శ్యామ్ యాదవ్, రమేష్ యాదవ్, ఆర్ వెంకటేష్, సతీష్ గౌడ్, అశ్విన్, దేవి, గోపాల్, మన్నే రమేష్ , వరలక్ష్మి, ఇందిర, వ్యాయామశాల నిర్వాహకులు, పలువురు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.