నిర్విరామంగా 15వ యూసఫ్ మెమోరియల్ టోర్నీ బ్రోచర్ నీ ఆవిష్కరించిన బూర్గంపాడు ఎస్ఐ పి.సంతోష్ కు

Published: Saturday January 07, 2023
భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 14 సంవత్సరాలుగా తమ మిత్రుడు యూసఫ్ జ్ఞాపకార్ధoగా నిర్వహించబడుతున్న  యూసఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెoట్ నీ విజయవంతంగా కొనసాగిస్తూ ,తిరిగి మరలా ఈ సంవత్సరము కూడా రాష్ట్ర స్థాయి 15వ యూసఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ నీ ఎర్పాటు చేసారు.ఈ క్రమంలో బూర్గంపహడ్ ఎస్సై  పి.సంతోష్ కుమార్ చేతుల మీదుగా యూసఫ్ టోర్నీ బ్రొచర్ నీ ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో వై.యం.సి కమిటీ సభ్యులు గొనేల నాని,సోహేల్ పాషా,సలీం,గొనెల సర్వేశ్వరరావు,భజన సతీష్,భజన ప్రసాద్, బొల్లు రవి,సారధి,బబ్బు రాయుడు,మందా ప్రసాద్ మరియు వై.ఎం. సి. కమిటీతో పాటు గ్రామ యువత తదితరులు ఈ కార్యక్రమంలో  పాల్గొన్నారు.