వేణుమాధవ్ కుటుంబాన్ని పరామర్శించిన మండల కాంగ్రెస్ నాయకులు

Published: Wednesday April 05, 2023

మధిర ఏప్రిల్ 4 ప్రజా పాలన ప్రతినిధి:మర్లపాడు గ్రామంలో యువకుడు మరణించగా వారి కుటుంబాన్ని మదిర మండల కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు. అనంతరం గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో పోరాడుతూగత రాత్రి మరణించిన న్యూస్ 9 టీవీ రిపోర్టర్ వేల్పుల పవన్ కళ్యాణ్ అన్నయ్య వేణుమాధవ్ మరణించగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మధిర బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు, మదిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు *అద్దంకి రవికుమార్ ,తాటిపర్తి వెంకటేశ్వర్లు, *కొంగల వీరస్వామి,వేల్పుల వెంకయ్య బాబు,క్రిష్ణ,శ్రీను స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.