జాతీయ జెండా ఆవిష్కరించిన... జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దావ వసంత సురేష్..

Published: Friday January 27, 2023

జగిత్యాల, జనవరి, 26 ( ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా పరిషత్ కార్యాలయం నందు 74 వ భారత రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జగిత్యాల జిల్లా పరిషత్ చైర్ పర్సన్  దావ వసంత సురేష్  జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. జిల్లా ప్రజలకు 74 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, భారత రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు, స్వతంత్ర సమరయోధులను స్మరించుకొని వారి ఆదర్శాలకు పునరాంకితం కావాలని పిలుపునిచ్చారు, భారత రాజ్యాంగంలోని విలువలు హక్కుల కోసం పాటు పాడాలన్నారు, స్వాతంత్రం కోసం మన జాతీయ పోరాటానికి స్ఫూర్తి ఇచ్చిన సత్యం, అహింస, శాంతి, సంఘీభావం, సార్వత్రిక  సౌభ్రాతృత్వం యొక్క గొప్ప ఆదర్శాలకు తిరిగి అంకితం చేసే రోజుగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ బత్తిని అరుణ, పాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, జెడ్పీ సీఈవో రామానుజన్ చార్యులు, పిఆర్ఈఈ రెహ్మాన్, జిల్లా పరిషత్ సిబ్బంది మరియు పంచాయితి రాజ్ సిబ్బంది పాల్గొన్నారు.