టిఆర్ఎస్ పార్టీ ప్రకటనపై సంబరాలు ** ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ **

Published: Friday October 07, 2022
ఆసిఫాబాద్ జిల్లా అక్టోబర్ 06 (ప్రజాపాలన, ప్రతినిధి) : టీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బుధవారం "బిఆర్ఎస్ పార్టీ గా" మార్పు చేస్తూ తీర్మానం చేసిన వెంటనే జిల్లా కేంద్రంలో ఎంపీపీ అరిగేలా మల్లికార్జున్ అధ్యక్షతన వహిస్తూ అంబేద్కర్ చౌక్ వద్ద టపాకాయలు పేల్చి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశ రాజకీయాలలో రానున్న రోజుల్లో కొత్త ఒరవడిని ముఖ్యమంత్రి కెసిఆర్ సృష్టిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్, నాయకులు బాలేష్ గౌడ్, బంధం శ్రీనివాస్, చిలువేరు వెంకన్న, సయ్యద్, నిసార్, ఎండి నజీర్, జావీద్, జీవన్, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area