అభయాంజనేయ స్వామీ 15 వ వార్షికోత్సవం లో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రె

Published: Friday February 04, 2022
శేరిలింగంపల్లి- ప్రజాపాలన /న్యూస్ శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడా గల శ్రీ అభయాంజనేయ స్వామీ దేవాలయం 15వ వార్షికోత్సవంలో ఈ రోజు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని శాలువతో సన్మానించి, సత్కరించటం జరిగింది. అనంతరం గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని పేర్కొన్నారు. శ్రీ అభయాంజనేయ స్వామీ 15వ వార్షికోత్సవంలో ప్రత్యేక పూజల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. స్వామి వారి ఆశీస్సులతో డివిజన్ ను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన అన్నారు.ఆలయాలు మానసిక ప్రశాంతతకు ఎంతగానో దోహదపడతాయని, ప్రజలపై స్వామి వారి కృప తప్పక ఉంటుందని పేర్కొన్నారు. కరోనా పూర్తిగా అంతమై ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. గచ్చిబౌలి డివిజన్ లో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ చేస్తానని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, గచ్చిబౌలి డివిజన్ వైస్ ప్రెసిడెంట్ తిరుపతి, సీనియర్ నాయకులు యాదయ్య, ప్రకాష్, ప్రసాద్, నర్సింగ్ రావు, ఆలయ పాలకవర్గం జక్కుల యాదవ రావు, జక్కుల నర్సింగ్ రావు, జక్కుల రమేష్, జక్కుల సహదేవ్, అర్చకులు మరి౦కంటి రఘునాథ్ చార్యులు, కాలనీ వాసులకు, స్థానిక నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.