రహదారుల వెంట ఇరువైపులా మొక్కల సంరక్షణ చేపట్టాలి. ఎంపీడీవో జములా రెడ్డి..

Published: Wednesday December 07, 2022
పాలేరు డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
రహదారుల వెంట ఇరువైపులా నాటిన మొక్కలను సంరక్షించాల్సిన. బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని నేలకొండపల్లి ఎంపీడీఓ, కె. జమలారెడ్డి, సూచించారు. మండలం లోని ఆజల్దండా పంచాయతీ ని ఆకస్మికంగా తనీఖీ చేశారు. తొలుత ఇటీవల పంచాయతీ భవనంను మార్చిన సందర్భంగా కార్యాలయం ను పరిశీలించారు. పలు రికార్డులను పరిశీలించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణం లో ఏర్పాట్లు పై చర్చించారు. రహదారుల వెంట నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలకులు, కార్యదర్శులు అందుబాటులో ఉంది. సేవలు అందించాలని సూచించారు. నర్సరీ లక్ష్యం నెరవేర్చేందుకు పాలకర్ల సభ్యులు. వనసేవకులు కృషి చేయాలని సూచించారు. పారిశుద్ధ్యం పట్ల అప్రమతండా ఉండాలని సూచించారు. ఆయన వెంట ఈజీఎస్ ఈసి కేషగిరిరావు, సర్పంచ్ బాత్ పార్వతి, కార్యదర్శి దుర్గ, తదితరులు పాల్గొన్నారు