ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి *చలో నాగర్ కర్నూల్* *దళిత, గిరిజన సభను జయప్రదం చ
Published: Monday January 23, 2023
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 22న నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన దళిత, గిరిజన మహాసభను జయప్రదం చేయాలని ఇబ్రహీంపట్నం యూత్ కాంగ్రెస్ నాయకులు చేతాళ్ల సతీష్ పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వ హించనున్న దళిత, గిరిజన సభకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు థాక్రే, సీఎస్పీ నా యకుడు మల్లు బట్టి విక్రమార్కలతో పాటు కాంగ్రెస్ గిరిజన రాష్ట్ర నాయ కుడు మాజీ మంత్రి బలరాంనాయక్, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జగన్లాల్నాయక్, పార్టీ ముఖ్య నాయకులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. దళిత, గిరిజన సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లాలో 25 మంది రాష్ట్ర స్థాయి నాయకులను ఇన్చార్జిగా అధిష్ఠానం నియమించిందని తెలిపారు. దాదాపు లక్ష మందితో నిర్వహించ తలపెట్టిన ఈ సభకు ఉమ్మడి జిల్లాలో దళిత, గిరి జనులు పెద్ద సంఖ్యలో తరళి వచ్చి ఆత్మగౌరవాన్ని చాటాలని ఆయన కోరారు. మార్కండేయ రిజర్వాయరు వద్ద మాజీ మంత్రి నాగం కళ్ల ముందే జరిగిన గిరిజనుడిని గొంతుపై కాళ్లు పెట్టి చేసిన దాడి రాష్ట్రంలోనే మొదటి అత్యంత హేయమైన చర్య అని పేర్కొన్నారు.
Share this on your social network: