మున్సిపాలిటీ పరిధిలో పలు కార్యక్రమాలకు హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Tuesday July 06, 2021
మధిర ప్రజాపాలన ప్రతినిధి ఐదో తేదీ మున్సిపాలిటీ మొదటిగా మధిర పట్టణంలో వైర రోడ్లో నూతనంగా ఏర్పాటు చేస్తున్నటువంటి శ్రీరస్తు హోటల్ ను ప్రారంభించినారు. అనంతరం మడుపల్లి లో 7వ వార్డులో నూతనంగా నిర్మిస్తున్న టువంటి డ్రైనేజ్ కు శంకుస్థాపన చేశారు అనంతరం ఇటీవల మరణించినటువంటి సురవర పూజిత తిరుపతి నుంచి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అనంతరం 6వ వార్డులో ఆరో వార్డు అధ్యక్షులు పారుపల్లి వీరభద్రమ్ గారి తండ్రి గారు పారుపల్లి రామయ్య గారు ఇటీవల మరణించడంతో వారి దశదినకర్మ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, మున్సిపల్ కమిషనర్ అంబటి రమాదేవి, మగధీర మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి అరిగె శ్రీనివాసరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్లీడర్ అప్పారావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ చావా వేణు, కౌన్సిలర్ ధీరావత్ మాధవి, వెంకట్రెడ్డి, తోగరు వరలక్ష్మి మేడికొండ కళ్యాణి, ఉమా మహేశ్వర్ రెడ్డి, ఓంకార్, కిరణ్, సర్వయ్య, నాని, రాజా, శివ తదితర పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు, అధికారులు హాజరైనారు.