సింగరేణి కార్మికులు టీబీజీకేస్ యూనియన్ బలపర్చాలి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

Published: Friday December 23, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 22 ప్రజా పాలన ప్రతినిధి: సింగరేణి కార్మికులు రానున్న ఎన్నికల్లో టీబీజీకేసి యూనియన్ కు బాసటగా ఉండాలని, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
గురువారం  స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పలువురు నూతన కార్మికులు టీబీజీకేఎస్ లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
 అనంతరం ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాల పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారని, దానికి నూతన కార్మికులు రుణపడి ఉంటూ, రానున్న రోజుల్లో టీబీజీకేజీ యూనియన్ ఆదరించాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు.
బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి ఉన్నత అధికారులతో మాట్లాడానని, త్వరలోనే అన్ని రకాల ప్రత్యేక వైద్యులు వస్తారని, బెల్లంపల్లి ఏరియాకు తిరిగి పునర్ వైభవం వస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బి, సుదర్శన్, కేంద్ర కమిటీ సభ్యుడు మున్సిపల్ కౌన్సిలర్, గెల్లి రాజలింగు, ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాసరావు, ఫిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, డి వై సి  ఎం ఓ, ఆర్ శౌరి, ఆసుపత్రి సిబ్బంది, పలువురు బిఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.