వైయస్సార్ తెలంగాణ పార్టీ మంచాల మండల కన్వీనర్ గా నేనవత్ శ్రీనివాస్ నాయక్

Published: Monday October 18, 2021

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం, మంచాల మండలం వైయస్ షర్మిల ఆదేశాల మేరకు దాద్ పల్లి గ్రామానికి చెందిన నేనవత్ శ్రీనివాస్ నాయక్ ను వైయస్సార్ తెలంగాణ పార్టీ మంచాల మండలం కన్వీనర్ గా నియమించిన భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ ఇరుగు సునీల్ కుమార్. ఈ సందర్భంగా నేనవత్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ గత పది ఏండ్లుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ మండల అధ్యక్షుడుగా కొనసాగుతూ మంచాల మండలంలో ప్రజా సమస్యలపై పోరాటం చేసానని తెలిపారు. ఈ సందర్భంగా మండలం కన్వీనర్ గా నియమించి నందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి లు కొండా రాఘవ రెడ్డి, పిట్టా రాంరెడ్డి, భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ ఇరుగు సునీల్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొలుగురి అమృత సాగర్, మాదగోని జంగయ్య గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.