బంజారా భవన్ కోసం స్థలం కేటాయించాలని మంత్రి మల్లారెడ్డికి వినతి
Published: Wednesday April 19, 2023
మేడిపల్లి, ఏప్రిల్ 18 (ప్రజాపాలన ప్రతినిధి)
మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల పరిధిలోని పీర్జాదిగూడ,బోడుప్పల్ జంట కార్పొరేషన్లలో బంజారా భవన్,కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల కొరకు స్థలం కేటాయించాలని స్థానిక కార్పొరేటర్లు కేతావత్ సుభాష్ నాయక్
భూక్య సుమన్ నాయక్ లు మంగళవారం రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మాత్యులు చామకూర మల్లారెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలసి విన్నవించారు.అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రివర్యులు జిల్లా కలెక్టర్ తో మాట్లాడి త్వరగా
బంజారా భవన్ కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారని కార్పొరేటర్లు తెలిపారు.
Share this on your social network: