ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

Published: Wednesday September 21, 2022
జన్నారం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా   జన్నారం మండల కేంద్రంలోని  ఎఅర్ఎస్ డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా బోధిస్తున్న చేర్లపల్లి గ్రామానికి చెందిన దండవేని శ్రీనివాస్ ముదిరాజ్  ఇటీవల రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అధ్యాపాక బహుమతి లభించినందున మంగళవారం వర్కస్ సాప్ట్ స్కిల్స్ ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఆయనను  సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ లేక్చరర్స్ పోరం ఆధ్వర్యంలో కరీంనగర్ ఖూసీ భవనంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అధ్యాపక బహుమతులను, గెలుపొందిన అధ్యాపకులకు ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కానిగంటి లక్ష్మణ్ వర్మ, పేరం మహేందర్ , గంగన్న, సందీప్ తదితరులు పాల్గొన్నారు.