చేవెళ్ల నుంచి కొంగరకలాన్ కలెక్టర్ కార్యాలయం వరకు బస్ సర్వీసులు నడపాలి.

Published: Wednesday November 23, 2022

చేవెళ్ల నవంబర్ 22 (ప్రజాపాలన):-

చేవెళ్ల నుండి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం కొంగరకలాన్ వరకు నూతన బస్సు సర్వీసు ప్రారంభించాలని  సిపిఎం పార్టీ చేవెళ్ల డివిజన్ ఇంచార్జ్ అల్లి దేవేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా దేవేందర్ మాట్లాడుతూ చేవెళ్ల నుండి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం కొంగరకలాన్ వరకు బస్సు సర్వీసు ప్రారంభం కోసం జిల్లా మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు చొరవ చూపాలని అన్నారు చేవెళ్ల నుండి చాలామంది పేదలు, విద్యార్థులు కలెక్టర్ కార్యాలయంలో ఏదన్నా పని ఉన్న బస్సులు లేక వెళ్లలేక పోతున్నారని కారు ఉంటే తప్ప కలెక్టర్ కార్యాలయం కి వెళ్లలేకపోతున్నారని సామాన్యులు పేదవాళ్లు వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లలేకపోతున్నారు కాబట్టి వెంటనే చేవెళ్ల నుండి కలెక్టర్ కార్యాలయానికి బస్సు సర్వీసు ప్రారంభించాలని ప్రభుత్వానికి ఆర్టీసీ అధికారులకు విజ్ఞప్తి చేశారు