చెరువులో పడి అవు మృతి.

Published: Saturday June 26, 2021
గుమ్మడిదల మండల కేంద్రానికి చెందిన రైతు నీరుడి శేఖర్ కు చెందిన ఆవు రోజు లాగే శుక్రవారం వాటిని మేత కోసం వెళ్లగా కూడా పోతాన్ కుంట చెరువులోకి నీళ్లు తాగడం కోసం వెళ్లి చెరువులో గుంతలు లోతుగా ఉండడంతో ఆవు పడిపోయి, అక్కడిక్కడే మృతి చెందిందని రైతు శేఖర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ చెరువులో గుంతలను ఎక్కువ లోతుగా తీయడం వల్ల తమ ఆవు చనిపోయిందనీ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం తమ కు నష్టపరిహారం చెల్లించాలని అధికారులను కోరారు.