పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలి ఎంపీడీవో

Published: Thursday November 24, 2022

మధిర నవంబర్ 23 (ప్రజా పాలన ప్రతినిధి) అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ అంగన్వాడి టీచర్లు సక్రమంగా అందించాలని ఎంపీడీవో కుడుముల విజయభాస్కర్ రెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని దెందుకూరు గ్రామంలో ఉన్న 2,4,5 అంగన్వాడి కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కేంద్రాలకు పిల్లలు ఎంతమంది వస్తున్నారు, గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారాన్ని ఏ విధంగా అందజేస్తున్నారు, అంగన్వాడీ సెంటర్ల పనితీరును ఆయన స్వయంగా పరిశీలించారు. అంగన్వాడి సిబ్బంది సమయపాలన పాటించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి వేమిరెడ్డి అనూష, అంగన్వాడి టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు