దిగ్విజయంగం రెండు సంవత్సరాలు పూర్తి అయిన పాలక వర్గం

Published: Friday January 28, 2022
మధిర జనవరి 27 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు మున్సిపాలిటీ పాలక వర్గం రెండు సంవత్సరాల పూర్తి అయిన మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భముగా మున్సిపల్ ఆఫీస్ నందు పాలక వర్గ సమక్షంలో చైర్ పర్సన్ శ్రీమతి మొండితోక లత  కేక్ కట్ చేయడం జరిగింది. ఈ సందర్భముగా చైర్ పర్సన్  మాట్లాడుతూ గడిచిన ఈ రెండు సంవత్సరాలు కౌన్సిల్ సభ్యులు మధిర పట్టణ అభివృద్ధి పథంలో నడిపేందుకు నాకు, అధికారులకు సహకరించారు, అదేవిధముగా రాబోయే కాలములో కూడా మనమందరం ఏకదాటిగా ఉండి మధిర పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సహకరిస్తారు అని కొరినారు. మధిర మున్సిపాలిటీ లో రెండు సంవత్సరాలు ముగించుకొని మూడు సంవత్సరాలుగా చేస్తున్న సందర్భంగా ప్రజలకు ప్రజాప్రతినిధులకు వార్డు కౌన్సిలర్ లకు శుభాకాంక్షలు తెలుపుతూ మధిర అంటే పచ్చదనం మున్సిపాలిటీగా అభివృద్ధి పదంగా ముందుకెళ్లాలని అందరూ ఆశీస్సులతో మున్సిపాలిటీని అభివృద్ధి బాటలో వేద్దామని వారు తెలిపారుఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్-చైర్ పర్సన్, మున్సిపల్ మేనేజర్, మున్సిపల్ RI, కౌన్సిల్ సభ్యులు మరియు కో- ఆప్షన్ సభ్యులు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కట్ట గాంధీ మేడికొండ కళ్యాణి కిరణ్ రమేష్ వైస్ చైర్మన్ విద్యా లత మాధవి విజయలక్ష్మి వంకాయలపాటి నాగేశ్వరరావు అప్పారావు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు