కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీలు నియామకం

Published: Saturday March 20, 2021
బీరుపూర్, మార్చి 19 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలం రంగసాగర్ గ్రామంలో మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేరుపూరి శుభాష్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎంపిపి మసర్థి రమేష్ అన్నారు. రంగసాగర్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నగావత్ గంగారెడ్డి ఉపాధ్యక్షుడిగా బియ్యల శంకర్ ప్రధాన కార్యదర్శిగా శాఖపురం నర్సయ్య కోశాధికారి నారపాక గంగరాజం కార్యవర్గ సభ్యులు నగావత్ రవి కొండ్ర పోషన్న అజ్మీర శాలన్న కిష్టయ్య ఓరుగంటి రాజవ్వ నారపాక విజయలక్ష్మి ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటిసి పాత పద్మ రమేష్ వైస్ ఎంపిపి బల్మురి లక్ష్మణ్ రావు సింగిల్ విండో చైర్మన్ నవీన్ రావ్ ఎంపిటిసి రంగు లక్ష్మణ్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఏనుగు జోగిరెడ్డీ శాఖపురం సతీష్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.