మాస్కులు పంపిణీ చేసిన సర్పంచ్ రామిరెడ్డి..

Published: Friday December 10, 2021
తల్లాడ, డిసెంబర్ 9 (ప్రజాపాలన న్యూస్): మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బండి బాలసౌరి గురువారం పాఠశాలలో విద్యార్థులకు మాస్కులు, శానిటైజెర్లు వితరణగా అందించారు. వీటిని గ్రామ సర్పంచ్ ఓబుల సీతారామిరెడ్డి చేతుల మీదుగా పంపిణీచేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కొత్తవైరస్ లనుండి మనల్ని రక్షించుకోవడానికి గ్రామంలో ప్రతిఒక్కరు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శీలం ముత్తారెడ్డి, పాఠశాల చైర్మన్ ఇనపనూరి శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు