పున: ప్రారంభించిన విద్యాలయాలను సందర్శించిన ఎంపీడీవో మహేష్ బాబు

Published: Thursday September 02, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 01, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలంలోని పలు పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు బుధవారం పున:ప్రారంభమైనందున ఇబ్రహీంపట్నం ఎంపీడీవో మహేష్ బాబు పాఠశాలలను, తరగతి గదులు, వంట గదులు, ఎలా సార్ టైప్ చేశారో తదితర వసతులను,  రికార్డులు పరిశీలించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఉప్పరి గూడ, రాయప్రోలు, ముక్కునూరు, పోచారం, చర్ల పటేల్ గూడెం తదితర పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఉప్పరిగూడ సర్పంచ్ బూడిద రామిరెడ్డి, చర్ల పటేల్ గూడా సర్పంచ్ కంబాలపల్లి గీతా రాంరెడ్డి, రాయపోల్ సర్పంచ్ బల్వంత్ రెడ్డి, ముక్కు నూర్ సర్పంచ్ స్వరాల జ్యోతి రాజు  వార్డ్ మెంబర్లు , అంగన్వాడీ సిబ్బంది, ఉప్పరి గూడా పంచాయతీ సెక్రెటరీ రిషికానేత తదితరులు పాల్గొన్నారు.