సమిష్టిగా సమన్వయంతో పనిచేసి విజయకేతనం ఎగురవేస్తాం

Published: Thursday February 25, 2021

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24 ( ప్రజాపాలన ) : హైద్రాబాద్-మహబూబ్ నగర్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో సమిష్టిగా సమన్వయంతో పనిచేసి విజయకేతనం ఎగురవేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన ఓటర్ లిస్ట్ ను టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఎమ్మెల్యేకు అందజేయడం జరిగింది. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదులో వేగం పెంచాలని రెండు రోజుల్లో సభ్యత్వం నమోదు పూర్తి చేసి ఆన్లైన్ చేయించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాచరణకు సంబంధించి నియోజకవర్గంలో శనివారం రోజు సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సామరస్యంతో సమన్వయంగా, సమిష్టిగా ముందుకు సాగాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైద్రాబాద్ - మహబూబ్ నగర్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, పార్టీ జనరల్ సెక్రెటరీ, సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యుడు  కె. కేశవరావు, రాష్ట్ర యూత్ సెక్రెటరీ శుభప్రద్ పటేల్, డిసిఎంఎస్ చైర్మన్ కృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.