ఐ పి ఎస్ ప్రవీణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి - బీజేపీ ఎస్టీ మోర్చా నాయకుడు దేవావత్ భరత్ సింగ్.
Published: Wednesday March 17, 2021
అమీర్ పేట్ (ప్రజాపాలన ప్రతినిధి) : హిందూ దేవుళ్ళ పై నమ్మకం లేదంటూ వ్యాఖ్యలు చేసిన ఐ పి ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యల్ని అందరూ ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎస్టీ మోర్చా నాయకుడు దేవావత్ భరత్ సింగ్. బాపునగర్ బస్తీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయి ఉండి హిందువులు దేవుళ్ళుగా కొలిచే వారిపై తమకు నమ్మకం లేదు అని పలువురితో ప్రమాణం చేయించడం ఆయన కుటిల బుద్దిని తెలుపుతుంది అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
Share this on your social network: