వైద్య సిబ్బందికి సన్మానం

Published: Friday December 17, 2021

కొడిమ్యాల, డిసెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలంలోని పూడూరు గ్రామ హెల్త్ సెంటర్ జాతీయ స్థాయి అవార్డు కు తెలంగాణ రాష్ట్రంనుండి ఏకైక బెస్ట్ హెల్త్ వెల్ నెస్ సెంటర్ గా ఎంపిక కాగా ఎం ఎల్ హెచ్ పి, వందన, ఏ ఎన్ ఎం, సంధ్యారాణి, ఆశా వర్కర్ రూప 14వ తేదీన ఢీల్లీలో అవార్డు తీసుకుని వచ్చినందున గురువారం రోజున మండల పరిషత్ అధ్యక్షురాలు మేనేని స్వర్ణలత కొడిమ్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బందిని శాలువాలతో ఘణంగా సన్మానించి, స్వీట్ తినిపించి అభినందించారు ఎంపీపీ మాట్లాడుతూ ఆజాదిక  అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దేశం మొత్తం లో సర్వే జరిపించగా తెలంగాణ రాష్ట్రం నుండి కొడిమ్యాల మండలం పూడూరు గ్రామం బెస్ట్ హెల్త్ వెల్ నెస్ సెంటర్ గా ఎంపిక కావడం మన మండలానికి గర్వకారణమన్నారు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోవిడ్-19 సమయంలో మీరు చేసిన సేవలకు దక్కిన అరుదైన గౌరవమన్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పర్లపల్లి ప్రసాద్, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్,ఆర్,బి,యస్, మండల అధ్యక్షుడు అంకం రాజేశం,అజయ్ రెడ్డి, మొగిలి రాకేష్, వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, సి హెచ్ వో, రాజశేఖర్, కృష్ణ ప్రసాద్, సూపర్వైజర్లు సరోజ, విజయలక్ష్మి, లచ్చయ్య, వి ష్ణు వర్థన్, పూలమ్మ, స్వప్న, నైదా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు